నర్సీపట్నంలో వరుస దొంగతనాలతో ప్రజలు బేజారెత్తుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ గేట్ వద్ద గల షాప్ పై భాగంలో పెంకులు తీసి లోపలకు ప్రవేశించి కెమెరాలు పట్టుకుపోయారు. అలాగే గురువారం అర్ధరాత్రి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలు పగలగొట్టి దేవుడి సొమ్మును దొంగలు ఎత్తుకు పోయారు. పది రోజుల కిందట స్థానిక వీరభద్ర స్వామి అయ్యప్ప ఆలయాల్లో దొంగలు పడి దేవుడి సొమ్మును పట్టుకుపోయారు.