ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లలో గెలుస్తాం: జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2017, 10:24 AM

వచ్చే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ‘ప్రజాసంకల్పం’ పాదయాత్రలో భాగంగా జగన్ తన ప్రసంగంలో ఎన్నికల్లో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ‘మరో ఏడాది, ఏడాదీన్నరలో మన ప్రభుత్వం వస్తుంది..’ అని జగన్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా పాదయాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 137 సీట్లలో విజయం సాధిస్తుంది.. అని అన్నారు.


వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం అని విశ్వాసం చేయడమే గాక, జగన్ ఇలా నంబర్ ను చెప్పడమే ఆసక్తిదాయకంగా మారింది. 137 సీట్లలో గెలుస్తాం.. అని జగన్ అంటున్నారు. కర్నూలు జిల్లాలో మంగళవారం ఏడో రోజున జగన్ పాదయాత్ర సాగింది. డోన్ నియోజకవర్గం పరిధిలోని బేతంచర్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com