కర్నూలు : ఆంధ్రప్రదేశ్లో ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా లేదని వైకాపా అధినేత జగన్ అన్నారు. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ బేతంచర్లలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆరోగ్యశ్రీ సౌకర్యాన్ని తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం జిఒ విడుదల చేసిందని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో నిర్మిస్తామన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏమైందని జగన్ ప్రశ్నించారు. హైదరాబాద్లో ఎయిర్పోర్టును వాడుకోలేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. 500 కోట్ల రూపాయిలతో ఎయిర్పోర్టు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించవచ్చునని ఆయన అన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆయన చెప్పారు.