అమరావతి: ఈనామ్ భూములపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఇనామ్ భూముల రిజిస్ట్రేషన్ల రద్దు వల్ల వేలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభ్యుల ప్రశ్నలకు మంత్రి మాణిక్యాలరావు సమాధానం ఇచ్చారు. సర్వీస్, ఈనామ్ భూముల క్రయ, విక్రయాలను హైకోర్టు రద్దు చేసిందన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నందున దీనిపై న్యాయ నిపుణులతో చర్చించి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.