విజయవాడ, సూర్య బ్యూరో : జిల్లాలో రానున్న పదిరోజుల్లో లక్ష మందికి ఉపాధి హామీ పథకంలో కూలీలకు పని కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ బాబు.ఎ. వీడియో కాన్ఫరెన్సలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి వివరించారు. గురువారం ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉపాధి హామీ పథకంతో అనుసంధానమైన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స హాలు నుండి జిల్లా కలెక్టర్ బాబు.ఎ. మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే ఉపాధి హామీ పనులు ఊపు అందుకున్నాయన్నారు.
జిల్లాలో నేటి వరకు 65 వేల మందికిపై గా ఉపాధి హామీ కూలీలు పనిచేస్తు న్నారన్నారు. రానున్న పది రోజుల్లో లక్ష మందికి పని కల్పించేలా ప్రణాళికలు రూపొందిం చుకొని అమలు చస్తున్నామని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివ రించారు. వేసవి కాలాన్ని దృష్టిలో వుంచుకుని మెట్ట ప్రాంతాల్లో ఏయే పనులు చేపట్టాలనే దానిపై అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంచాయతీ రాజ్, ఉమెన్ అండ్ చైల్డ వెల్ఫేర్, విద్యా శాఖ, ఆర్డబ్లు్యఎస్ వంటి శాఖల్లో ఉపాధి హామీ పథ కం ద్వారా చేపట్టవలసిన పనులను గుర్తించి వేగవంతం చేస్తున్నామని వివరించారు.
జిల్లాలో 180 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని, అయితే ఈ కేంద్రాలకు త్రాగునీరు, శానిటేషన్ అవసర మైన నిధులు మంజూరు లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా సీఎం స్పందిస్తూ 14వ ఆర్థిక సంఘం నిధులను ఖరు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సలో జిల్లా కలెక్టర్తోపాటు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ బి.రాజగోపాల్, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టరు డి.చంద్రశేఖర్ రాజు, జిల్లా పరిషత్ సీఇవో టి.దామోధరనాయుడు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టరు కె. కృష్ణకుమారి వివిధ శాఖ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.