విజయవాడ, సూర్య బ్యూరో : మైనారిటీ వర్గాలలో నిరక్షరాస్యత దూరం చేయ డం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అంకిత భావంతో కృషి చేస్తున్నారని `ఆంధ్రప్రదేశ్ మైనారిటీ ఫైనాన్స కార్పొరేషన్ ఛైర్మన్ ఎం.డి.హిదాయత్, ఎంఎల్సి షరీఫ్ అన్నారు. గురువారం నగరంలో జరిగిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ మైనారిటీ ఫైనాన్స కార్పొరేషన్ తరఫున `ఎన్టిఆర్ విద్యోన్నతి' పథకం ద్వారా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తామ న్నారు. ఐఎఎస్, ఐపిఎస్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రిలిమ్స, మెయిన్సలో వారు ఏ కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకున్నా, వారికి లక్ష రూపాయల ఫీజు మైనారిటీ ఫైనాన్స కార్పొరేషన్ తరఫున అందిస్తామని, అంతేకాకుండా `బోర్డింగ్' ఖర్చుల నిమిత్తం పది నెలలు, నెలకు 12 వేల రూపా యల వరకు సై్టఫండ్ కూడా ఇవ్వటానికి నిర్ణయించామని ఎం.డి. హిదాయత్ అన్నారు. ధర్మవరం, పెనుగొండ, కదిరి, కళ్యాణదుర్గం, తిరుపతి, మదనపల్లి, రాజమండ్రి, తెనాలి, నరసరావుపేట, గురజాల, జమ్మమడుగు, కడప, రాజంపేట, గుడివాడ, నూజివీడు, విజయవాడ, సిరిసిల్ల, నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, నాయుడుపేట, ఒంగోలు, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు లలో రాష్ర్ట వ్యాప్తంగా 25 ప్రాంతాలలో రెసిడెన్షియల్ స్కూళ్ళని మైనారిటీ వర్గాల కోసం సీఎం చంద్రబాబు కేటాయించారని, ఈ నూతన స్కూళ్ళని రాష్ర్ట వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రారంభించడానికి కృషి చేస్తున్నా మన్నారు. ఈ సమావేశంలో మైనారిటీ ఫైనాన్స కార్పొరేషన్ డైరెక్టర్ లాల్వజీర్, ఎం.డి. ఉషాకుమారి, జి.ఎం. లియాఖత్ తదితరులు పాల్గొన్నారు.