విజయవాడ, మేజర్న్యూస్: విలువలతో కూడిన చదువే సమజాభివృద్ధికి బీజం వేస్తుందని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స శాఖ కమిషనర్ ఎస్స్కే రెహమాన్ స్పష్టం చేశారు. గురువారం విజయవాడలోని ప్రభుత్వ డిగ్రీ కళశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చదువు అనేది వ్యక్తిగతం కాదని, అది సామాజిక, సమాజాభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. ప్రాచీన భారతీయ విద్యావ్యవస్థ వ్యక్తిత్వ వికాసం, విలువలు, నైతికత, నిస్వార్థ జీవన విధానాలను నేర్పించిందన్నారు. తద్వారా సామాజిక అభ్యున్నతికి కొత్తబాటలు నిర్మించిందని వివరించారు. విద్య ద్వారానే నవ భారత సమసమాజం సాధ్యమన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సామాజిక బాధ్యతతో మెలిగి, ప్రభుత్వ కళాశాలను పరిరక్షించుకునే దిశగా, విలువ లతో కూడిన విద్యావ్యాప్తికి కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసకాలాన్ని సద్వినియోగపరుచుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సూచిం చారు. పలు పోటీల్లో విజేతలకు కమిషనర్ రెహమాన్, ఎమ్మెల్యే ఉమా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ వల్లూరి పల్లి రవి, కార్పొరేటర్ కంచర్ల శేషారాణి, కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు.