విజయవాడ, సూర్య బ్యూరో : మహాశివరాత్రి సందర్బంగా ప్రయాణికుల సౌక ర్యార్ధం కష్ణా రీజియన్ పరిధిలో ప్రత్యేక బస్సులను నడుపు తున్నట్లు ఆర్టీసీ ఆర్.ఎం. పి.వి.రామారావు పేర్కొ న్నారు. శ్రీశైలం సహా జిల్లాలోని పలు శైవ ేత్రాలకు సైతం ఈ బస్సులు ఏర్పాటు చేశారు. శివరాత్రి రద్దీని దష్టిలో వుంచు కుని ఈ ఏడాది 242 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఇప్పటికే ఆయా డిపోల వారీగా ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. 24న ఉదయం నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కాను న్నాయి. విజయవాడతో సహా నూజివీడు, జగ్గయ్య పేట, ఉయ్యూరు, మచిలీపట్నం, ఐలూరు, పెదకల్లేపల్లి, ఇబ్రహీం పట్నం, తిరువూరు, అవనిగడ్డ ప్రాంతాల నుంచి శ్రీశైలం, ముక్తా్యల, అమరా వతి, బలివే, నీలాద్రి, గుట్టపాడు, సంగమేశ్వరం దైవక్షేత్రాలకు ఈ ప్రత్యేక బస్సులు రోజంతా తిరుగుతాయి. ఏటా శివరాత్రి సందర్బంగా విజయవాడ, మచిలీ పట్నం సహా జిల్లాలోని పట్టణ ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు పెద ్దసంఖ్యలో భక్తులు తరలివెళ్తారు. దీంతో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతుంది. 2016లో 201 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా ఈ ఏడాది పెరిగిన డిమాండ్గను దష్టిలో ఉంచుకుని మరో 41 బస్సులను అదనంగా సిద్ధం చేశారు. జిల్లా నుంచి మొత్తం పది శైవక్షేత్రాలకు ఈ బస్సులు తిప్పుతామని తెలిపారు. అవసరమైతే మరిన్ని సర్వీసులను సైతం డిమాండ్ను బట్టి నడుపుతామని ఆర్టీసీ కష్ణాజిల్లా రీజినల్ మేనేజర్ రామారావు వెల్లడించారు.