ఇసుక అక్రమంగా రవాణా అవుతుంది అని ప్రతిపక్షాలు రోజు అంటూనే ఉన్నాయి . కానీ అలాంటిది ఏమి లేదు చట్ట బద్దం గానే ఇసుక అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఐతే టీడీపీ నాయకులూ ఇసుక రవాణా జరుగుతున్నా ఒక లారీ ని పట్టుకొని దీనికి సమాధానం చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు. అక్రమ ఇసుకను తరలిస్తూ ఆ వాహనానికి వైసీపీ జెండా కప్పారు. దీని అర్థం ఏంటి? అక్రమ వ్యాపారాలన్నీ వైసీపీ ప్రభుత్వంలో అధికారికంగానే జరుగుతాయనా? లేక ఈ వాహనం జోలికి పోలీసులు రావద్దని హెచ్చరికా? పాపం పోలీసులు! యూనిఫామ్ కన్నా వైసీపీ జెండాకే ఎక్కువ గౌరవం ఇస్తున్నట్టు ఉన్నారు. అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు.