తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఒక న్యాయవాదిపై దారి కాసి క్రికెట్ బ్యాట్, ఇనుప రాడ్లతో గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పిఠాపురం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బాదం ఈశ్వరబాబు తన పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర్లో సుమారు ఆరుగురు యువకులు బాదం ఈశ్వర బాబుపై దాడికి పాల్పడ్డారు. ఈశ్వరబాబు కు తీవ్రగాయాలు కాగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై పిఠాపురం ఎస్ఐ శంకర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.