తిరుమల శ్రీవారిని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఆలయ అదికారులు దగ్గరుండి ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఉద్దవ్ థాక్రే పేర్కొన్నారు.