ఢిల్లీలోని మాలవీయ నగర్లో సోమవారం రెండు నెలల చిన్నారిని కన్నతల్లే దారుణంగా హత్య చేసింది. అనంతరం చిన్నారి మృతదేహాన్ని ఓవెన్లో ఉంచింది. సాయంత్రం పొరుగింటి బాలుడు నిందితురాలి ఇంటికి వెళ్లాడు. ఎంతసేపటికి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చింది.పసికందు కూడా కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప కోసం చుట్టుపక్కల ఎంత వెతికినా కనిపించలేదు. చివరకు ఇంట్లోని ఓవెన్లో మృతదేహం కనిపించిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యలో ప్రధాన నిందితుడు, ఇతర నిందితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.