కాకినాడ నగరంలో ఇంటి పన్ను కట్టకపోతే సామాన్లు తీసుకుపోతాం అని అలానే కర్నూల్ నగరంలో చెత్త పన్ను కట్టలేదని చెత్త తీసుకు వచ్చి వారి భవనాల ముందు వెయ్యడం లాంటి చర్యలు ప్రభుత్వం గడిచిన వారం రోజులలోనే చేసింది . ఈ సందర్భంగా ఈ సెగ విజయవాడకి కూడా పాకిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశంలో సహచర కార్పొరేటర్లతో, కేశినేని నాని కుమార్తె శ్వేతా కలిసి నిరసన తెలుపుతూ , ప్రజలపైన భారం మోపబోయే చెత్త పన్నును తొలగించాలని, ఆస్తి పన్ను, డ్రైనేజీ పన్నులు తగ్గించాలని, నగర అభివృద్ధి కొరకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వల నుండి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేసారు.