జనసైనికులకోసం జనసేన పార్టీ ఎంతో శ్రద్ధ వహిస్తుంది అంటే నమ్మక తప్పదు. ప్రమాద భీమా పధకం కింద చనిపోయిన జనసైనికునికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అలానే, ప్రమాదాలకు గురి ఐన వారిని ఆదుకోవడం లాంటివి చాలానే చేస్తుంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ తరపున ఎన్నికల్లో బూత్ ఏజెంట్ గా పోరాడిన గుడల విజయ్ కిడ్నీ దెబ్బతిని తన తల్లి గారి ద్వారా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం జనసైనికుల సహకారంతో భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ సందీప్ ఆధ్వర్యంలో సేకరించిన 4 లక్షల 36 వేల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.