వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తాము ఓడిస్తామని కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి సవాలు చేశారు. పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో తాను వైసీపీ ఇన్చార్జిగా పోస్ట్ తీసుకుంటానని, అక్కడ పార్టీ కోసం పనిచేసి పవన్ ను ఓడిస్తానని తెలిపారు. పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. జనసేన కార్యకర్తలకు ఆయన మళ్లీ అన్యాయం చేస్తున్నారని, పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నాడని ఆయన అన్నారు. త్వరలో జన సైనికులు బాధపడే రోజు వస్తుందని చెప్పుకొచ్చారు. ఇలా ప్యాకేజీలకు అమ్ముడుపోయి.. నేతలు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ అన్యాయం చేయకూడదని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్నే వెన్నుపొటు పొడిచిన చరిత్ర చంద్రబాబుకు ఉందని, పవన్ కల్యాణ్ ను వెన్నుపోటు పొడవడం ఆయనకు ఓ లెక్కకాదని అన్నారు.