గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి సీతానగరం పుష్కరఘాట్ వద్ద శనివారం ఉదయం అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి దేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వయసు సుమారు 35 సంవత్సరాలు కలిగి నీలం రంగు, నలుపు రంగు చారల చోక్కా, సిమెంట్ రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని శవాగారానికి తరలించి గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు.