ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులపై సర్కారు దృష్టిసారించింది. ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తూ బిజీగా ఉంటున్నారని, ప్రభుత్వ ఆసుపత్రులతో ఉండట్లేదనే విషయంపై శుక్రవారం కఠిన నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉండగా రెండు గంటలకు ఒకసారి సెల్ఫీ తీసి పంపాలని ఆదేశించింది. అదే కోవలో శనివారం మరో కీలక ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులు, నర్సులు బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలనే నిబంధనను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బోధన, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలలో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని ఆదేశించింది. ఇది పకడ్బందీగా అమలు చేసేందుకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విధానం కారణంగా డ్యూటీ మధ్యలో బయటకు వెళ్తే జీతంలో కోత ఉంటుంది.