రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి చేసేందుకు కృషి చేస్తుంటే విపక్ష నేత జగన్ నరకాసురుడిలా దానికి అడ్డుపడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీకి, రాజధాని నిర్మాణానికి, గ్రామీణ ఉపాధి హామీ నిధులకు అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. బీసీల గురించి మాట్లాడుతున్న జగన్కు ఏడేళ్ల తర్వాత వెనుకబడిన వర్గాలు కావాల్సి వచ్చాయంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా మంచి చేస్తుంటే వైకాపా ప్రకటించిన నవరత్నాలు ఎవరికి కావాలని వ్యాఖ్యానించారు. త్వరలోనే రాష్ట్రంలోనే నిరుద్యోగ భృతిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 21న దుబాయ్లో ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం మైగ్రేషన్ పాలసీని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు.