అనంతపురం జిల్లా హిందూపురం మండలం కిరికెర వద్ద వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి సుధీర్ (15) గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాల మేరకు హిందూపురం మండలం కిరికెర గ్రామ సమీపంలో ఎల్ ఆర్ జి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యాహ్నం సమయంతో సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న బావిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు స్నేహితులు ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది గురువారం మధ్యాహ్నం నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు దాదాపు 20 గంటలు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు.