అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల పరిధిలోని కొండూరు గ్రామంవద్ద ఉన్న అడవికి గుర్తుతెలియని వ్యక్తులు గురువారం నిప్పం టించారు. దీంతో వందలాది ఎకరాలు బుగ్గిపాలయ్యాయి. ఇంతలోనే అక్కడ పనిచేస్తున్న కూలీలు కుశలవ ఆర్గానిక్లో ప నిచేసే సిబ్బంది గుర్తించి ట్యాంకర్లలోని నీటితో ఆర్పడానికి ప్రయత్నించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. అప్పటికే వేలాది చెట్లు బుగ్గిపాలయ్యాయి. ఇంద లో రావిచెట్లు, కానుగ, గంగిరేణివంటి బుగ్గిపాలయ్యాయని కొండూరు గ్రామస్థులు తెలిపారు. పశుకాపరులు, లేదా బొగ్గులు కోసం ఎవరైనా నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.