పుత్తూరు మున్సిపల్ ప్రజల చిరకాల వాంఛ మున్సిపల్ పార్కును ప్రారంభించడం జరిగింది. కోటి పది లక్షలు మంజూరు చేయించి పార్కు నిర్మాణం చేయడంతో పాటు ఇదే పార్కులో మన ప్రియతమ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించాం. అని నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. 17 ఏళ్ల పుత్తూరు ప్రజల కల నెరవేరిన వేళ నెరవేరిన రోజుగ అభివర్ణించారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లపుడు ముందంజలోనే ఉంటుంది దానికి నిదర్శనమే ఎలాంటి కార్యక్రమాలు అని తెలిపారు.