కరోనా నేపద్యంలో గత రెండేళ్లుగా పాక్షికంగా రద్దు చేసిన గుంతకల్- కాచిగూడ ట్రైన్ నంబర్ 57426, కాచిగూడ - గుంతకల్ ట్రైన్ నంబర్ 57425 అనే రెండు ప్యాసింజర్ రైళ్లు ఎట్టకేలకు ఏప్రిల్ నుంచి తిరిగి ప్రారంభం కానున్నట్లు సంబంధిత రెల్వే అధికారులు గురువారము ఒక ప్రకటనలో పాత్రికేయులకు తెలిపారు.ఇటీవల సంబంధిత దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్లను దశల వారిగా పునరుద్దిస్తామని చెప్పిన నేపద్యంలో ఈ రైలు కు మోక్షం లభించింది.