ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద్విచక్ర వాహనం నుండి రూ.. 4 లక్షల నగదు అపహరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 09:50 AM

బ్యాంకులో నగదు డ్రా చేసి ద్విచక్ర వాహనం సైడు బ్యాగులో ఉంచిన రూ. 4 లక్షల నగదు అపహరణకు గురైందీ. డి. హీరేహాళ్ మండలం నాగలాపురం గ్రామానికి చెందిన రైతు శివకుమార్ మంగళవారం మధ్యాహ్నం యూనియన్ బ్యాంకులో రూ. 4 లక్షల నగదు డ్రా చేశాడు. బయటికొచ్చి ద్విచక్రవాహనంలో ఉంచాడు. పక్కనే ఉన్న పండ్లరసం బండి వద్దకు వెళ్లి జ్యూస్ తాగాడు. తిరిగొచ్చి వచ్చి చూసేసరికి బ్యాగులోహనగదు మాయమైంది. దీంతో బాధితుడు రాయదుర్గం పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని యూపీఎస్ సీఐ సురేష్ బాబు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com