ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకతాయిలు చేష్టలకు పచ్చని చెట్లు అగ్నికి ఆహుతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 09:48 AM

సోమందేపల్లి మండలం కేంద్రం లోని 44వ జాతీయ రహదారిప్ర క్కన వున్న కొండలకు ఆకతాయిలు నిప్పు పెట్టారు. పచ్చని కొండలు నేడు ఆకతాయిలు చేష్టలకు బూడిద పాలు అవుతున్నాయి.


నియోజకవర్గం లోని పెనుకొండ,  సోమందేపల్లి  వద్ద కొండలకు గత వారం రోజులుగా  ఆకతాయిలు నిప్పు పెడుతున్నారు. అటవీ సంపద  బుగ్గిపాలు అవుతోంది. పచ్చని కొండలకు ఆకతాయిలు నిప్పు పెడుతుండడంతో కొండలన్నీ  కాలిపోతున్నాయి. కొండల్లో ఉన్న బోధ, పశుగ్రాసం, పచ్చని చెట్లు  అగ్గికి కాలి బూడిద అవుతున్నాయి.


ప్రతి సంవత్సరం వేసవి లో కొండ ప్రాంతాలు అగ్నికి ఆహుతి అవుతూనే ఉన్నాయి. దీంతో పర్యావరణానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. ఆకతాయిలు ఎండు గడ్డి కి నిప్పు పెడుతుండడంతో కొండ ప్రాంతాల్లోని పక్షులు జంతువులు అంతరించి పోతున్నాయి.


ముఖ్యంగా పెనుకొండ, సోమందేపల్లి ప్రాంతాల్లోని కొండలకు  ఆకతాయిలు నిప్పు పెట్టడం పరిపాటిగా మారింది. దీంతో  ఆకతాయిలు చేష్టలకు అటవీ సంపద రోజురోజుకు అంతరించి పోతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని కొండలకు నిప్పు పెడుతున్న  వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com