వైసీఎల్పీ సమావేశం ముగిసింది. 2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల పనితీరు పై సీఎం జగన్ చేయించిన సర్వేల రిపోర్టులను ఆయన పరిశీలించారు. వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేల పై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. వారి పనితీరుపై ఇప్పటికే జగన్కి ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని తెలుస్తోంది. వారి పనితీరు, ఆరోపణల నేపథ్యంలో కొంతమందిపై వేటు పడే అవకాశం ఉంది. తొలిసారి ఎన్నికైన 30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. 12 మంది సీనియర్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేపైనా వేటుకు ఛాన్స్ ఉంది. ఆ 50 మందికి ఈసారి ఎన్నికల్లో నో టికెట్ అని వైసీపీలో చర్చ జరుగుతోంది.