తూర్పు గోదావరి: కాకినాడలో మంగళవారం స్థానిక బాల భవన్ వద్ద మున్సిపల్ కార్మికులు ఎఫ్ ఆర్ ఎస్ సమయంలో మున్సిపల్ విభాగం చూస్తున్న 38సచివాలయం కార్యదర్శి కృష్ణ మహిళా మున్సిపల్ కార్మికుల పట్ల అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నారని, మహిళల పట్ల చులకన దురుసుగాప్రవర్తిస్తున్నారని.. ఏపీ మున్సిపల్, వర్కర్స్, యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేశారు. ఈ నిరసన ధర్నా కు ముఖ్య అతిథులుగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ.. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న సచివాలయం కార్యదర్శి కృష్ణ తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులపై కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రసాద్ అన్నారు. సమాజంలో మహిళలను గౌరవించడం మన బాధ్యత అని, అలాంటివి మహిళా మున్సిపల్ కార్మికుల పై చులకన భావం చూపించడం, కనీస గౌరవం లేకుండా మాట్లాడటం, నచ్చితే ఒకలాగా నచ్చ లేకపోతే ఇంకొక లాగని పని చెప్పడం అనేది చాలా దౌర్భాగ్యమని ఇలాంటి కార్యదర్శిని తక్షణమే సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించాలని ప్రసాద్ అన్నారు.