చిత్తూరు: బీ కొత్తకోట మండలంలోని శీలంవారిపల్లె పంచాయతీ కార్యాలయం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని, తక్షణమే సర్వే నిర్వహించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు స్థానిక తహసిల్దార్ కృష్ణమోహన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. అక్రమ నిర్మాణాలపై గతంలో ఫిర్యాదు చేయడంతో ఆపేశారని, మళ్లీ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ విషయమై ప్రశ్నిస్తే దౌర్జన్యాలకు దిగుతున్నారని తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.