యుద్ధం నిలిపివేతపై రష్యా, ఉక్రెయిన్ మధ్య గురువారం మరోసారి చర్చలు జరిగాయి. టర్కీలో జరిగిన ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దాడుల విరమణ, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపునకు వీలుగా కారిడార్ల ఏర్పాటుపై ఇరు దేశాల ప్రతినిధులు చర్చించారు. యుద్ధాన్ని విరమించడానికి రష్యా సిద్ధంగా లేదని, తాము లొంగిపోవాలని భావిస్తోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. అయితే తాము రష్యాకు లోంగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. మరియుపోల్లో ఓ ఆసుపత్రిపై జరిపిన దాడిలో ఒక బాలిక సహా ముగ్గురు మరణించగా, 17 మంది గాయపడ్డారు. జైతోమిర్ నగరంలో కూడా 2 ఆసుపత్రులపై దాడులు జరిగాయి. రష్యా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 1300 మంది చనిపోయారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.