సరదాగా బీచ్ కు వెళ్లిన ఓ యువతిపై మందుబాబులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని కృష్ణా జిల్లా బందరు మండలం పల్లిపాలెం బీచ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఓ యువతి తన ప్రియుడితో కలిసి బీచ్కి వెళ్లింది. ఈ క్రమంలో వారిని గమనించిన ఇద్దరు మందుబాబులు ప్రియుడిని చెట్టుకి కట్టేసి, అతని ముందే ఆ యువతిపై అత్యాచారం చేశారు.
యువతి పరిస్థితిని గమనించిన ఆమె సోదరుడు నిలదీయడంతో జరిగిందంతా చెప్పింది. వెంటనే బాధితురాలి సోదరుడు బందరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని గుర్తించామని, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు ఎస్సై వాసు తెలిపారు.