అహ్మదాబాద్ : పాఠశాల విద్యార్థుల భద్రత కోసం పాఠశాలల్లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలని గుజరాత్ రాష్ట్రప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. గురుగ్రామ్ నగరంలోని పాఠశాలలో దారుణ ఘటన జరిగిన నేపథ్యంలో పాఠశాల ఆవరణతోపాటు తరగతి గదుల్లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలని దీపక్ ధనక్ నిశీత్ జోషి అనే న్యాయవాది ద్వారా గుజరాత్ హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు. ఈ పిల్ పై విచారణ జరిపిన హైకోర్టు బెంచ్ చీఫ్ జస్టిస్ ఆర్ ఎస్ రెడ్డి, జస్టిస్ వీఎం పంచోలిలు పాఠశాలల్లో సీసీటీవీ కెమేరాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని గుజరాత్ సర్కారును ఆదేశించారు.