తెన్నేటి సముద్రతీరాన ఓ ఓడ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండేళ్ల క్రితం కొట్టుకొచ్చిన ఓడను ఫ్లోటింగ్ రెస్టారెంట్ గా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంటే పర్యావరణాన్ని పాడుచేసే పనులు చేపట్టవద్దని విపక్షాలు ఆందోళనకు దిగాయి. విశాఖలో చిచ్చురేపుతున్న ఓడ కధాకమామిషు ఏంటో ఇపుడు చూద్ధాం.
విశాఖ సాగర తీరాన తెన్నేటి పార్కు సమీపంలోకి కొట్టుకొచ్చిన M.V. MAA CARGO SHIP రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. విశాఖ నగరాన్నితరచూ తుఫాను వణికిస్తుంటుంది. రెండేళ్ల క్రితం తీవ్రవాయుగుండానికి ఊహించని విధంగా ఓ షిప్పు కొట్టుకొచ్చింది. సామాన్యులు ఆశ్చర్యపోతే పోలీసు యంత్రాంగం బెంబేలెత్తింది. పోలీసులు,నేవి,కొస్ట్ గార్డ్,మైరైన్ పోలీసులు చుట్టుముట్టారు. తీరా అరా తీస్తే అది విశాఖ పోర్టుకు బోగ్గును తీసుకోచ్చి తిరిగి వెళ్ళడానికి సిద్దం అవ్వగా వాయుగుండం కారణంతో పోర్టులో ఆగిపోయిందని సమాచారం. అదే వాయుగుండం తీవ్రవాయుగుండం మారిన తరువాత అలల ఉదృతి ఎక్కువకావడంతో హ్యంగర్ సరిగా వేయ్యకపోవడంతో తెన్నేటి తీరానికి కొట్టుకొచ్చింది.
తెన్నేటి పార్కు చేరిన ఓడ సందర్శకులతో సందడిగా మారింది. ఓడను కాపాడేందుకు పోలీసుల సైతం కొద్ది నెలలపాటు కాపాలా కాశారు. విశాఖ పోర్టు ట్రస్ట్, కోస్ట్ గార్డ్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, మర్చెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్, ఇండియన్ నేవీ, హిందూస్థాన్ షిప్ యార్డ్ ఇలా మొత్తం ఎనిమిది సంస్థలు షిప్ను తిరిగి సముద్రంలోకి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన సఫలం కాకపోవడంతో పోలీసులు ఆంక్షలు ఎత్తివేశారు. సందర్శకులు రావడం మెుదలు పెట్టారు. షిఫ్ మాత్రం అక్కడ నుండి కదల్లేదు. దీంతో ఈ నౌకను ఇక్కడే వదిలేసేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది.