న్యూఢిల్లి : అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు పాకిస్తానీయులకు చికిత్స నిమిత్తం మెడికల్ వీసాలు మంజూరు చేయనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. లాహోర్కు చెందిన ఉజైర్ హుమాయూన్ అనే వ్యక్తికి తన మూడేళ్ల పాపకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించడానికి వీసా మంజూరు చేయాలని కోరారని సుష్మా స్వరాజ్ చెప్పారు. అలాగే నూర్మా హబీబ్ అనే మహిళ తన తండ్రికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించడానికి వీసా మంజూరు చేయాలని కోరిందని సుష్మా స్వరాజ్ చెప్పారు. ఈ రెండు కేసుల్లోనూ మెడికల్ వీసాలను మంజూరు చేస్తున్నామని ఆమె అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమె చెప్పారు.