ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోందని, హోదాకి ప్రత్యేక ప్యాకేజీ ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డాడని అన్నారు. కామర్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు మేరకు ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలరి డిమాండ్ చేసారు. ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడంతోనే హోదా బదులు ప్యాకేజీ ఇచ్చామని కేంద్రం వాదిస్తోందని, చంద్రబాబు చేసిన ఘోర తప్పిదానికి రాష్ట్రం ఎంత మాత్రం నష్టపోకూడదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రజల తరుపున డిమాండ్ చేసారు.
దేశ చరిత్రలో ఎక్కడా, ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో సీఎం జగన్ నిరుద్యోగ అభ్యర్థులకు మేలు చేకూరుస్తున్నారని, 2019 నుంచి ఇప్పటివరకు మొత్తం 6, 03, 756 పోస్టులను భర్తీ చేశారని అన్నారు. కొత్తగా 1, 237 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడంతో పాటు పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ ద్వారా ఏర్పాట్లు చేసిందని అన్నారు. 2008 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు సైతం ముఖ్యమంత్రి న్యాయం చేసారని గుర్తుచేసారు.
నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించి వారిని సన్నద్దం చేయాలని ఈ మేరకు ఏపి స్కిల్స్-వాట్స్ అప్-ఎన్ ఎస్ డి సి ఇండియా డిజిటల్ స్కిల్స్ అకాడమి ప్రోగ్రాం ఈ విషయంలో ప్రశంసనీయమైన చొరవచూపిందని, విద్యార్దులకు అవసరమైన ఉపాధి నైపుణ్యాలను అందజేయడంతో పాటు వ్యాపార వేత్త అలోచనా ధోరణి పెంపొందిస్తోందని అన్నారు.
ఆరిపోయిన నిప్పును రాజేయడానికి పచ్చ పేపర్లతో ఎంతగా గాలి కొట్టినా లాభం లేదని, జనం మీవెంట ఉంటే కదా బాబూ అగ్గి రాజుకునేది అని ఎద్దేవా చేసారు. అనుకుల మీడియా ఉంటే చాలన్న భ్రాంతిలోకి ఎప్పుడు జారిపోయారో అప్పుడే మీ పతనం మొదలైందని. ఆరిన జ్వాల ఎప్పటికీ ఎగసిపడదని తెలుసుకోవాలని అన్నారు. వయసు మీద పడిందని ఇక రెస్ట్ తీసుకోండని హితవు పలికారు.