శ్రీకాకుళం: మండల కేంద్రం టెక్కలి లోని టెక్కలి మెళియాపుట్టి రోడ్డు లో జాతీయ రహదారి ఫ్లైఓవర్ వంతెన వద్ద ఆటో బోల్తా పడి ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నర్సింగపల్లి కి చెందిన లోపింటి సోములు, కర్రి చంద్రమ్మ లు గాయపడ్డారు. వీరు కూరగాయలు కొనేందుకు టెక్కలి వస్తుండగా సర్వీస్ రోడ్డు నుంచి వస్తున్న లారీని గుర్తించిన ఆటో డ్రైవరు తోట నూకరాజు సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో సోము లకు కాలు చేయి విరిగిన టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆటో డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.