మా దేవుడు నివేనయ్యా ... మా భావవూ నివ్వెనయా .... అంటూ చంద్రబాబును హిజ్రాలు పాటలతో కొనియాడారు. అంతే కాదు చంద్రబాబు ఫొటోకు పాలాభిషేకం చేశారు . సమాజంలో వివక్షతకు గురవుతున్న హిజ్రాల సంక్షేమానికి చంద్రబాబు పింఛన్ పథకాన్ని తీసుకు వచ్చారు. వారికీ వేయి రూపాయల పింఛన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రకటించడమే ఎందుకు కారణం ... హిజ్రాలకు కూడా రూ. పింఛనులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో నిర్ణయించారు. దీంతో చంద్రబాబు చిత్ర పటానికి ఆల్ ఇండియా సమతా హిజ్రాల హక్కుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా నంద్యాలలో పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐక్య వేదిక అధ్యక్షుడు విజయ్ కుమార్ నేతృత్వం వహించారు. తమ దైన శైలిలో హిజ్రాలు నృత్యం చేస్తూ బాబు కు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి లో జరిగిన జిల్లా కలెక్టర్ ల సమావేశంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్న 3లక్షల మంది హిజ్రాలకు మేలు జరుగుతుందన్నారు విజయ్ కుమార్. నెలనెల రూ. 1000 పింఛన్లు, పక్కా ఇళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారని అన్నారు. మొదటి నుండి హిజ్రాలకు అండగా నిలిచిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కూడా హిజ్రాల సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు.