విశాఖ స్టీల్ ప్లాంట్కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. విశాఖ ఉక్కు ఉ ఆంధ్రుడి హక్కు అంటూ పోరాడి సాధించుకున్న ఈ కేంద్ర ప్రభుత్వ కర్మగారానికి ఇండియా సీ ట్రేడ్ అవార్డు లభించింది. కొచ్చిలో ఈ అవార్డు ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని స్టీల్ ప్లాంట్ సీఎండీ మధుసూదన్ అందుకున్నారు.