అగ్రవర్ణాల్లోని పేద మహిళలకూ ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వారి ఆర్థిక సాధికారత కోసం ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ పేరుతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పకపోయినప్పటికీ ఈ పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ సంకల్పించారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి మొత్తం 3,92,674 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.589 కోట్లను వారి ఖాతాల్లో జమచేశారు. ఈ పథకం ద్వారా ఒక్కో అక్కచెల్లెమ్మకు ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఆర్థికసాయం అందనుంది.