చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాడు ఉద్యోగుల తోకలు కట్ చేస్తామన్న చంద్రబాబు నేడు ఉద్యోగ సంఘాలు ఒకే తాటిపైకి రావలనడం సిగ్గుచేటన్నారు.ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచినా ముందుకు రాలేదన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరచాలన్న వారి భ్రమలో పడవద్దని సూచించారు. 1.25లక్షల ఉద్యోగాలను ఏకకాలంలో ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అని అన్నారు శ్రీకాంత్ రెడ్డి.