ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కు చేరనుంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కొత్త జిల్లాల పేర్లు ఇవేనంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న జిల్లాలు:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు.
కొత్తగా ప్రతిపాదించిన 13 జిల్లాలు:
అరకు(2 జిల్లాలు), అనకాపల్లి, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, నరసరావుపేట, అమలాపురం, నరసాపురం, బాపట్ల, నంద్యాల, హిందూపురం, రాజంపేట.