ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేలపై వేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2017, 12:02 PM

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీటీవీ దినకరన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దినకరన్‌ మద్దతు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. పార్టీ విప్‌ను ధిక్కరించారని 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్‌ ధన్‌పాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 24న స్పీకర్‌ వీరికి షోకాజు నోటీసులు జారీ చేశారు.


ప్రభుత్వాన్ని పడగొట్టి ముఖ్యమంత్రి పళనిస్వామిని గద్దెదించుతానని గత కొంతకాలంగా దినకరన్‌ వరుస ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మద్దతు వర్గంపై అనర్హత వేటు పడింది. ఇటీవలే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com