చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీటీవీ దినకరన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. పార్టీ విప్ను ధిక్కరించారని 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ ధన్పాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 24న స్పీకర్ వీరికి షోకాజు నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వాన్ని పడగొట్టి ముఖ్యమంత్రి పళనిస్వామిని గద్దెదించుతానని గత కొంతకాలంగా దినకరన్ వరుస ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మద్దతు వర్గంపై అనర్హత వేటు పడింది. ఇటీవలే శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.