అమరావతి: నీరు-ప్రగతి, వ్యవసాయరంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ వర్షపాతం ఆశాజనకంగా ఉందని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు ప్రవాహం కొనసాగుతోందని తెలిపారు. శ్రీశైలంలో 75టిఎంసిల నీరు వచ్చి చేరింది..మరో 25టిఎంసిలు వచ్చే అవకాశం ఉందన్నారు.
రిజర్వాయర్లలో నీటి నిల్వపై ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.భూమిని జలాశయంగా మార్చుకోవాలి, భూగర్భ జలమట్టం పెంచాలన్నారు. నదుల అనుసంధానంతో డెల్టా, రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని చెప్పారు.అక్టోబర్ 3వవారం నుంచి నవంబర్ తొలివారం మధ్య .. మూడు తుపాన్లు వచ్చే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
వర్షాల వల్ల ఉల్లిపంట దెబ్బతిందని చెప్పుకొచ్చారు. కనీస మద్దతు ధరకు ఉల్లి కొనుగోలు చేయాలని సూచించారు. నరేగా నిధులు రాకుండా విపక్షం పదేపదే కేంద్రానికి ఫిర్యాదులు పంపుతున్నామని ఆయన చెప్పారు. ఈ ఏడాది రూ.7500 కోట్ల నరేగా బడ్జెట్ను వినియోగించుకోవాలన్నారు. అంగన్వాడి భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరో 30వేల ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. కైలాష్ సత్యార్థి సురక్షిత బాల్యం-సురక్షిత భారత్ పాదయాత్రను. విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులకు సూచించారు.