ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 23, 2022, 09:30 AM

కృష్ణాజిల్లా గుడివాడలో క్యాసినో రాజకీయం ఇప్పుడు ఇరువర్గాలు కేసులు పెట్టుకునేవరకు వెళ్లింది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషనులో కేసు నమోదైంది.లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. కమిటీ మెంబర్లకు పర్మిషన్ ఇస్తే వందలాది మంది లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించారంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.ఈ కేసులో A1గా కొనగళ్ళ నారాయణ, A2 గా బొండా ఉమామహేశ్వరరావు, A3గా కొల్లు రవీంద్ర, A4గా వర్ల రామయ్య, A5గా నక్కా ఆనందబాబును A6గా కాగిత కృష్ణ ప్రసాద్‌లను చేర్చారు పోలీసులు.


మరోవైపు గుడివాడలో వైసీపీ నేతలపై టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు. తమపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ కంప్లైంట్ చేశారు టీడీపీ నేతలు. వైసీపి నేత ధూకపాటి శశిభూషన్ అనుచరులతో దాడి చేసినట్లుగా ఎఫ్ఐఆర్ నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com