తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మొత్తం 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. నిన్న శ్రీవారిని 84,147 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,751 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండి ఆదాయం రూ. 2.71 కోట్లు గా ఉంది.