రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - బీజాపూర్ రహదారిపై ఆటో, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటన లో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.