ముంబయి: ఇటీవల ప్రముఖ జర్నలిస్ట్ గౌరి లంకేశ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్ రెహమాన్ స్పందించారు.‘ఇది చాలా బాధాకరం. గౌరి లంకేశ్ను చంపేశారని తెలియగానే చాలా బాధపడ్డా. భారతదేశంలో మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకూడదనిఆశిస్తున్నాను. ఇలాంటివి మళ్లీ జరిగితే ఇది నాదేశం కాదు. నా దేశం ప్రగతిశీలగా ఉండాలి’ అని పేర్కొన్నారు రెహమాన్.సెప్టెంబర్ 5న గౌరీ లంకేశ్ను గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపారు. ఈ కేసును సిట్కు అప్పగించాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.