అమరావతి: రాష్ట్రంలో మూడో విడత రుణమాఫీ నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలిపారు. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలను పీడీ అకౌంట్లలో జమ చేశామని, ఈ నెల 10 నుంచి మూడో విడత రుణమాఫీ మొత్తాలను రైతు ఖాతాల్లో వేస్తామని వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. పది శాతం వడ్డీతో మూడో విడత రుణమాఫీ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.