ముంబైలో గణేష్ నిమజ్జన వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. లాల్ బగ్చా గణపతిని నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. లయ బద్దంగా మేళాలలో, డప్పు దరువులతో లాల్ బగ్చా గణపతి ఊరేగింపు సాగుతోంది. దారిపొడవునా వేలాది మంది లాల్ బగ్చా రాజాకు వీడ్కోలు పలుకుతున్నారు. అటు ముంబైలోని పలు ప్రాంతాల్లోనూ గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన నివాసంలోనే నిమజ్జనం పూర్తి చేశారు. తన ఇంట్లో పూజలందుకున్నగణనాథుడిని కృత్రిమంగా ఏర్పాటు చేసిన కొలనులో నిమజ్జనం చేశారు.