న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు మీసా భారతికి చెందిన ఫామ్హౌజ్ను మనీ ల్యాండరింగ్ కేసులో ఈడీ అటాచ్ చేసింది. ఢిల్లీలో ఉన్న బిజ్వాసన్ ఫామ్హౌజ్ మిషాలి ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ పేరు మీద ఉన్నది. అయితే ఈ సంస్థకు మీసా భారతి, ఆమె భర్త శైలేష్ కుమార్లు డైరక్టర్లుగా ఉన్నారు. మనీల్యాండరింగ్ సొమ్ముతోనే ఫామ్హౌజ్ను 1.2 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. మిషాలి ప్యాకర్స్కు సంబంధించిన వివరాలను లాలూ కూతురి నుంచి సేకరించినట్లు ఈడీ తన స్టేట్మెంట్లో పేర్కొన్నది.