సమర్పించిన మంత్రి శిద్ధా దంపతులు
కర్నూలు, మేజర్న్యూస్ : కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు సందర్భంగా భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు దంపతులు పట్టువసా్తల్రు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి దర్శించుకుంటున్నారని చెప్పారు.
మల్లిఖార్జునస్వామి ఆశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఇవ్వాలని, ఆయన చేపట్టే ప్రతి పని దిగ్విజయం అయ్యే విధంగా స్వామి ఆశీర్వదించాలని మంత్రి కోరారు.
ప్రభుత్వం తరుపున తాను స్వామి వారికి పట్టువసా్తల్రు సమర్పిండం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భరత్ గుప్తా దంపతులు తదితరులు పాల్గొన్నారు