ఇప్పుడు ప్రపంచాన్ని ఒమిక్రాన్ కరోనా వేరియంట్ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటి వరకు ప్రజలు ఎదురుకున్న రెండు దఫాల కరోనా వేరియంట్లు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ఒక ఎత్తు. అందరూ మాస్కులు ధరించాలని లేకపోతే భారీ జరిమానాలు తప్పవంటూ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
ఇక జిల్లాల వారీగా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రకాశం జిల్లా అంటేనే గ్రామీణ ప్రాంతాలకు పెట్టింది పేరు. ఇక్కడ ప్రజలకు వీటిపై అవగాహన లేకపోవడంతో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముందుగా రాజకీయ సభలు, సమావేశాలు, సంబరాలు హాట్ స్పాట్ కేంద్రాలుగా మారుతాయని అంచనా వేస్తున్నారు. తర్వాత పాఠశాలలు, దేవాలయాలు, కూరగాయల మార్కెట్లు, సినిమా థియేటర్లు, ఉత్సవాలు, బహిరంగ సభల ప్రాంగణాలలో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. అసలే ఒమిక్రాన్ వేరియంట్ ఆరు రెట్లు వేగంగా ఇతరులకు వ్యాపిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు.
పాఠశాలల్లో పిల్లలకు కరోనా సోకితే వారి ఇంటిలోని వృద్ధులపై దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలతో అమ్మ, అమ్మమ్మ నాయనమ్మ, జేజయలు, వృద్ధులు కావటంతో పిల్లల ద్వారా వారికి వ్యాపించి వారు ఈ కొత్త రకం కరోనా వేరియంట్ తో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.
ఇక మార్కెట్లకు, కిరాణా దుకాణాలు కు వెళ్లిన సామాన్యులు తాము ఇంటికి తిరిగి ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నడం వల్ల ఇక్కడ కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
సినిమా హాల్లో అయితే రెండున్నర గంటల పాటు ఒక హాల్లో ఉండవలసిన పరిస్థితి. అప్పుడు లోపల ఉన్న ప్రజలు పీల్చి వదిలే గాలి ఎటు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇక్కడ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ పాటిస్తున్న సందర్భాలు చోటుచేసుకున్నాయి.
గ్రామీణ ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో ప్రజలు మరి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటారో, అధికారులు ఎలా వారికి అవగాహన కల్పిస్తారో వేచి చూద్దాం. ఈ కొత్తరకం ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ను అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరు మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ కొత్తరకం ఒమిక్రాన్ వేరియంట్ నుండి రక్షించుకోండి.